అమరావతి: ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘విధి నిర్వహణలో విఫలమైన నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆయన శేష జీవితం హైదరాబాద్ లో ఆనందంగా గడవాలి. ఎడ్డెం అంటే తెడ్డెం అనకుండా ఇకనైనా తిన్నగా ఉండాలి’ అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వారం తర్వాత సూయజ్ కాలువలో ఇరుక్కున్న భారీ నౌక కదిలింది. కానీ చంద్రబాబుపై ఉన్న స్టేలు మాత్రం కదలవు. “ఎవర్ గివెన్” నౌక గమ్యాన్ని చేరుతోంది. “ఎవర్ స్టేలు” మాత్రం అలానే ఉన్నాయంటూ’ ఆయన ఎద్దేవా చేశారు.