న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. గత వారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ రూ.47 వేల దిగువకు వచ్చింది. ఢిల్లీలో ఇవాళ తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.81 తగ్గి రూ.46,796కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,057 వద్ద ముగిసింది.
ఇక బంగారంతోపాటే వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.984 తగ్గి రూ.67,987కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,971 వద్ద ముగిసింది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,779 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.02 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆ 8 రాష్ట్రాల్లో లక్ష దాటిన యాక్టివ్ కేసులు: కేంద్రం
పాకిస్థాన్కు మరో 10 లక్షల డోసుల టీకాలు పంపిన చైనా
14 రోజులు కొవిడ్ కర్ఫ్యూ.. ప్రజారవాణా బంద్..!
ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ ప్రధాని ఫోన్..!
రైల్లో వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. వీడియో
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
కరోనా ఎఫెక్ట్: శ్రీ హేమకుంద్ సాహిబ్ యాత్ర వాయిదా
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?