శ్రీనగర్ : నార్కో డ్రగ్స్ అక్రమ రవాణాను పోలీసులు భగ్నం చేశారు. రూ.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని తాంగ్దర్ సెక్టార్లో చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్ సిబ్బంది, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ప్రయత్నాన్ని విఫలం చేశారు. 10 కిలోల మాదకద్రవ్యాలు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.50 కోట్లుగా సమాచారం.