సిద్దిపేట : కరోనా మహమ్మారిపై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలో పర్యటించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. గుర్రంపై ఎక్కి విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్రావు మాస్కులు ధరించిన ఫోటోలను ప్రదర్శిస్తూ.. మాస్కు ధరించండి.. కరోనాను అరికట్టండి.. వంటి నినాదాలను ఆ ఫోటోలపై రాసి ఉంచారు. అలా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ గుర్రాలపై తిరుగుతూ సిద్దిపేట ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాను అరికట్టే ఆయుధం మాస్కే అని అటు వైద్యులు, ఇటు ప్రభుత్వాలు చెబుతున్న విషయం తెలిసిందే.