చెన్నై : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న క్రమంలో చెన్నై పోలీసులు సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లను తరలించి కరోనా రోగుల ప్రాణాలను కాపాడారు. కొలత్తూర్ లోని ఓ ప్రైవేట్ దవాఖానలో మెడికల్ ఆక్సిజన్ నిండుకుందని, పది మంది కొవిడ్-19 రోగులకు ఆక్సిజన్ అవసరమని అక్కడి వైద్యుడు పోలీసులకు ఫోన్ చేశారు.
దవాఖానకు ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన సంస్థ స్పందించకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. కాల్ అందుకున్న ఏసీపీ పీ స్టీఫెన్ సత్వరమే స్పందించి దవాఖానకు చేరుకోగా అక్కడ కేవలం ఒకే ఒక సిలిండర్ అందుబాటులో ఉంది. పోలీసుల టీం చొరవ చూపి కేవలం మూడు గంటల్లోనే ఆస్పత్రికి 2ం ఆక్సిజన్ సిలిండర్లను తరలించింది. ఆక్సిజన్ సిలిండర్లను తయారుచేసే కంపెనీలతో తమకున్న పరిచయాలతో వెంటనే తెప్పించగలిగామని స్టీఫెన్ వెల్లడించారు. ఇక పోలీసులు సకాలంలో స్పందించి తమ ఆప్తుల ప్రాణాలు కాపాడారని కొవిడ్ రోగుల బంధువులు పేర్కొన్నారు.