హైదరాబాద్: శాసన మండలి చైర్మన్ ప్రొటెమ్గా నియమితులైన ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం చైర్మన్ ప్రొటెమ్ను నియమించింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2007 నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పటాన్చెరు నియోజకర్గంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన వెన్నవరం భూపాల్రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మూడుసార్లు విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన భూపాల్రెడ్డి.. జిల్లా పరిషత్ పంచాయతీ సమితి కో-ఆప్షన్ సభ్యుడి స్థాయి నుంచి ఎంపీపీగా పనిచేశారు. 1947 మే 1న జన్మించిన భూపాల్రెడ్డి పీయూసీ వరకు చదివారు.