ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
మరికల్, జూన్ 4: టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి ఏండ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, ప్రతి కాలనీకి సీసీ రోడ్ల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నూతన మండలంగా మరికల్ ఏర్పాడిన తర్వాత మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఆంజనేయస్వామి ఆలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు, 7వ వార్డులో రూ. 20లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. ఈ నెలలోనే పెట్టుబడి డబ్బులు సీఎం కేసీఆర్ రైతుల ఖాతాల్లో వేస్తారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి అందరి కష్టాలను తీర్చే సీఎం కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖారెడ్డి, సర్పంచ్ గోవర్ధన్, ఎంపీపీ శ్రీకళ, వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీలు, మండల కోప్షన్ సభ్యుడు మతీన్, ఉపసర్పంచ్ శివకుమార్ పాల్గొన్నారు.
పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన
దామరగిద్ద, జూన్ 4 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని క్యాతన్పల్లిలో రూ.16 లక్షలతో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ధాన్యం బస్తాలు సమయానికి రావడం లేదని, కేంద్రం నుంచి ధాన్యం తీసుకుపోవడానికి లారీలను కూడా అధికారులు పంపించడం లేదని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే స్పందించి జిల్లా సివిల్ సైప్లె అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్వరగా ధాన్యం తీసుకుపోవాలని, ఖాళీ సంచులు కోస్గి నుంచి కాకుండా నారాయణపేట నుంచి మండలానికి పంపించే ఏర్పాట్లు చేసి, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. మండలంలో ఎక్కడా ధాన్యం కొనలేదనే మాట రావద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, సర్పంచ్ లావణ్య, జిల్లా పరిషత్ సభ్యురాలు, పాఠశాల ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.