శాయంపేట, మే 7 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ సోకకుడా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. శుక్రవారం శాయంపేట పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి, సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, సర్పంచ్లు కందగట్ల రవి, అబ్బు ప్రకాశ్రెడ్డి, ఉపసర్పంచ్ దైనంపెల్లి సుమన్, మాజీ ఎంపీటీసీ భాస్కర్, మాజీ సర్పంచ్ నందం, కరణ్బాబు పాల్గొన్నారు.