హైదరాబాద్ : కొవిడ్ చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కొరడా ఝుళిపిస్తున్నది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వైద్యశాలల లైసెన్స్లను రద్దు చేయడంతోపాటు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నది. తాజాగా రాష్ట్రంలో ఇవాళ మరో ఆరు దవాఖానల లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కిమ్స్ (సికింద్రాబాద్) , సన్షైన్ (గచ్చిబౌలి), సెంచరీ (బంజారాహిల్స్), లోటస్ ( లక్డీకాపూల్ ), మెడిసిన్ (ఎల్బీనగర్), ఇంటెగ్రో (టోలీచౌకి) దవాఖానలు ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 22 కొవిడ్ దవాఖానల లైనెన్స్లు రద్దయ్యాయి. 113 దవాఖానలకు వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ కొత్తగా 8 ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.