న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉభయసభల ఫ్లోర్ లీడర్స్తో సమావేశం కానున్నారు. లోక్సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పాలసీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో ప్రధాని ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రధాని కార్యాలయ వర్గాలు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించాయి.