గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్
దోమకొండ, మే 15 : పోటీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్ అన్నారు. మండలకేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను గ్రంథాలయంలో ఉంచుతామని అన్నారు. గ్రంథాలయంలో గతంలో ఉన్న పుస్తకాల వివరాలను, కావాల్సిన పుస్తకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పుస్తకాలను అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట గ్రంథాలయ సిబ్బంది మౌనిక, ప్రశాంత్, నవీన్ తదితరులు ఉన్నారు.