న్యూఢిల్లీ: పంజాబ్ అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ స్మారకంగా (Jallianwala Bagh Memorial) పునరుద్ధరించిన కాంప్లెక్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సాయంత్రం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి, గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ల సమక్షంలో కొత్తగా పునరుద్ధరించిన కాంప్లెక్స్ను మోదీ ప్రజలకు అంకితం చేశారు. 1919 నాటి ఘటనలను గుర్తుకు తెచ్చే విధంగా సౌండ్ అండ్ లైట్ షోను కూడా నిత్యం వీక్షించే ఏర్పాట్లు చేశారు.
‘ధైర్యవంతులైన పంజాబ్, పవిత్రమైన జలియన్వాలాబాగ్ భూమికి సెల్యూట్ చేస్తున్నా. విభజన సమయంలో, అనంతరం జరిగినా సంఘటనలు దేశంలోని ప్రతి మూలలోనూ, ముఖ్యంగా పంజాబ్లో మనం చూడొచ్చు. అప్పటి భారతదేశ ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తుచేసుకోవడానికి ఏటా ఆగస్టు 14 ను విభజన భయానక జ్ఞాపక దినంగా గుర్తించాం’ అని నరేంద్ర మోదీ తెలిపారు.
జలియన్ వాలా బాగ్ మెమోరియల్ శాంతియుత ప్రజాస్వామ్య నిరసనకు ప్రజల హక్కు గురించి భవిష్యత్ తరాలకు తప్పనిసరిగా రిమైండర్గా ఉపయోగపడుతుందని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. ఈ మారణకాండలో షహీద్ ఉధమ్ సింగ్ వాడిన పిస్టల్తోపాటు ఆయన వ్యక్తిగత డైరీ వంటి వాటిని బ్రిటీష్ ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించాలని ప్రధాని మోదీకి కెప్టెన్ విజ్ఞప్తి చేశారు.
ఆ ఫార్ములా చట్టవిరుద్ధం : చైనా సుప్రీంకోర్టు
ఇక కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
పెండ్లి పందిరిలో పుషప్స్.. వావ్ గ్రేట్!
మోడెర్నా వ్యాక్సిన్తో ఇద్దరు మృతి
కొవిడ్ మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు పొడగింపు
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
ఒక్క రోజే కోటి డోసులు : డబ్ల్యూహెచ్ఓ అభినందన
అసోంలో మళ్లీ హింసాకాండ : ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం
చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్ డయనా విడాకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..