హైదరాబాద్ : భారతీయ రైతుల స్థాయిని పెంచడంతోపాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో కృషిచేయల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ కందా రచించిన ‘అగ్రికల్చర్ ఇన్ ఇండియా: కాంటెంపరరీ చాలెంజెస్-ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇంకం’ పుస్తకాన్ని హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు సమస్యల కారణంగా రైతులు తమ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారని, ఈ సమస్యలను ఇలాగే కొనసాగించడం సరికాదని ఆయన సూచించారు.
భూ కమతాల విస్తీర్ణం తగ్గడం, రుతుపవనాలపైనే ఆధారపడటం, నీటిపారుదల సౌకర్యాల లేమి, సరైన సమయానికి అవసరమైనంత రుణాలు అందకపోవడం మొదలైన సమస్యలే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతులు ఖర్చును తగ్గించి, మంచి ఆదాయాన్ని అందించే ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, రైతులు వినియోగించుకుని లాభాలు పొందడానికి అవకాశం ఉన్నదని వెంకయ్యనాయుడు చెప్పారు. ఉత్పత్తి సమస్య, ధరల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రాధాన్యతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. రవాణా, నిల్వ, గిడ్డంగుల వంటి మౌలిక వసతులు, పంటల్లో వైవిధ్యత, పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి వాటిపై దృష్టిపెట్టాలని సూచించారు.
ఇటీవలి కాలంలో చదువుకున్న యువత వ్యవసాయం వైపు ఆకర్షితులై అద్భుతాలు సృష్టించడం ఆనందదాయకమని చెప్తూ.. కరీంనగర్ జిల్లాకు చెందిన సంధ్య, మల్లికార్జున్ రెడ్డి వ్యవసాయం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించి వారికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, పుస్తక రచయిత డాక్టర్ మోహన్ కందా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, డైరెక్టర్ ప్రొఫెసర్ జువ్వాడి దేవీప్రసాద్, బీఎస్పీ బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అనిల్ షాతోపాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ గడ్డపై చిప్ తయారు చేస్తే 7 వేల కోట్ల ప్రోత్సాహం : కేంద్ర ప్రభుత్వం ఆఫర్
డబ్ల్యూహెచ్ఓకు మొత్తం కొవిడ్ డాటా ఇచ్చాం : చైనా శాస్త్రవేత్త స్పష్టీకరణ
ఫ్రస్టేషన్లో టార్చిలైట్ విసిరివేసిన కమల్ హాసన్
ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు : చివరి ముగ్గురు నిందితులు విడుదల
ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండేవారికి కుచించుకుపోనున్న గుండె.. వ్యోమగాములపై పరిశోధన
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం.. వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి
భారతదేశానికి వచ్చిన దలైలామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..