బోధన్, మే 13: కొవిడ్ బాధితులను రక్షించుకుంటామని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. బోధన్ ప్రభు త్వ జిల్లా దవాఖానను గురువారం సందర్శించిన ఆయన.. కొవిడ్ వార్డు ల్లో పర్యటించారు. చికిత్స పొందుతు న్న వారితో మాట్లాడారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూ ర్ణ, వైద్యులతో మాట్లాడి బాధితులకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. అనంత రం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తనతో మాట్లాడి ఆక్సిజన్ సిలిండర్లు కావాలని అ డిగారని వాటిని వెంటనే సమకూరుస్తామన్నారు. ఎమ్మెల్యే కోరినట్లుగా దవాఖానలో ఐసీయూ, టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుచేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఆక్సిజన్ సరఫరా, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, మందుల కొరత లేదని మంత్రి స్పష్టంచేశారు. వైద్యులు, నర్సులు అందిస్తున్న సేవలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్రెడ్డి తదితరులు ఉన్నారు. బోధన్కు వచ్చిన మంత్రి ప్రశాంత్రెడ్డిని బోధన్ టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్రావు దేశాయి సన్మానించారు.