ట్రంప్ మద్దతుదారులపై మోదీ అసహనం

న్యూఢిల్లీ: అమెరికాలోని కాపిటల్ హిల్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని ఖండించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలా చట్ట విరుద్ధ నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే చర్యలను సహించకూడదని ఆయన అన్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన దాడుల వార్తలు చూసి చాలా బాధ కలిగింది. శాంతియుతంగా, క్రమబద్ధంగా అధికార బదిలీ జరగాలి. ఇలాంటి చట్టవిరుద్ధ నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే చర్యలను సహించకూడదని మోదీ ట్వీట్ చేశారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికలను తమ నుంచి దొంగిలించారని, తమ గళాలు వినాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు కాపిటల్ హిల్పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇందులో ఒక మహిళ మృతి చెందగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ హింసాత్మక ఘటనలను ప్రపంచ నేతలు ఖండించారు.
Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. The democratic process cannot be allowed to be subverted through unlawful protests.
— Narendra Modi (@narendramodi) January 7, 2021
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి