పురావస్తు శాఖ అధికారులతో భూమి అమ్మిన వ్యక్తుల గొడవ
తవ్వకాలు చేపట్టొద్దని నిరసన
జనగామ రూరల్, ఏప్రిల్ 9 : లంకెబిందెలో వాటా కావాలని భూమి అమ్మిన వ్యక్తులు శుక్రవారం సంఘటనా స్థలంలో ఆందోళన చేశారు. వరంగల్ నుంచి వచ్చిన పురావస్తు శాఖ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బందితో అక్కడి మట్టిని కుప్ప పోయిచి జల్లెడ పట్టిస్తుండగా వారు అడ్డుకున్నారు. తమకు వాటా ఇచ్చేంత వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని డిమాండ్ చేశారు. కొద్ది సేపు పనులు నిలిపివేసిన అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఐ కృష్ణప్రసాద్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. మీ డిమాండ్ను అధికారుల దృష్టికి తీసుకుపోతామని అప్పటి వరకు పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని సూచించారు. సర్పంచ్ అంబాల ఆంజనేయులు గౌడ్ వారికి సర్దిచెప్పి అవకాశం ఉంటే వారికి వాటా ఇప్పించాలని అధికారులను కోరారు. మట్టిని మాత్రమే జల్లెడ పడుతున్నామని, తవ్వకాలు జరుపమని ఆర్ఐ తెలిపారు. జల్లెడ పడుతున్న క్రమంలో రెండు పూసలు కోరల్ బిడ్(ఎముకలతో చేసినవి), రాతి పూసలు, బంగారు పగడం దొరికింది. వాటిని అధికారులు కవర్లో భద్రపరిచారు. మిగతా అన్ని వివరాలు జిల్లా కలెక్టర్ తెలుపుతారని పురావస్తు శాఖ ఏడీ మల్లు నాయక్ తెలిపారు.
బంగారంపై అనుమానాలు
మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కీసర మండలం భోగారానికి చెందిన మెట్టు నర్సింహకు నెల క్రి తం భూమి అమ్మినట్లు పెంబర్తికి చెందిన సంకటి నర్సయ్య, అయిలమ్మ, ఎల్లయ్య, పర్షరాములు తెలిపారు. భూమిని జేసీబీ, డోజర్లతో చదును చేయిస్తున్న క్రమంలో బంగారం లభ్యమైందని, దానిని తీసుకెళ్లి కొంత బంగారం, వెండి అక్కడే వదిలివేశాడని ఆరోపిస్తున్నారు.
రజాకార్ల కాలం నాటివా.. మావోయిస్టులు పెట్టినవా ?
జనగామ ప్రాంతం పోరాటాలు, ఉద్యమాలకు పురిటిగడ్డ. ఈ ప్రాంతంలో రజాకార్లు ప్రజలను అనేక విధాలుగా అణిచివేసేది. అలాగే పెంబర్తి గ్రామ సమీపంలో ఆలేరు మండలం టంగుటూరులో ప్రతి ఇంట్లో ఓ మావోయిస్టు ఉండేవాడు. అయితే లంకె బిందె రజాకార్ల కాలంలో దాచిందా లేక మావోయిస్టులు రహదారికి సమీపంలో దాస్తే గుర్తుంటుందని వారు భూమిలో పెట్టారా అనే అనుమానాలు ఉన్నాయి. గ్రామాల్లో స్థితిమంతులు కూడా చాలామంది ఉండేవారని, గతంలో దొంగలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే వారని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు. వారే బంగారాన్ని దాచారా అని ప్రజలు చర్చించుకుంటున్నా రు. పురావస్తు శాఖ అధికారులు మాత్రం దేవతలవి కావని, రజాకార్ల కాలం నాటివని అంచనా వేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
కార్లు అద్దెకు తీసుకుని అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్.. దంచి కొడుతున్న ముంబై ఇండియన్స్