న్యూఢిల్లీ: భారత స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ రష్యాకు చెందిన అర్టిశ్ లోప్సన్తో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఏడాదికి పైగా రింగ్కు దూరమైన విజేందర్ ఈ నెల 19న తిరిగి బరిలో దిగనున్నాడు. గోవా సముద్ర తీరంలో క్యాసినో షిప్ రూఫ్పై సూపర్ మిడిల్ వెయిట్ (76 కేజీలు) విభాగంలో జరుగనున్న ఈ పోరు కోసం విజేందర్ రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నాడు.