హైదరాబాద్ : కరోనా రెండో వేవ్లో తెలంగాణలో తమ సంస్థకు చెందిన 600 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారని ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్ బారిన పడుతున్నట్లు గుర్తించామన్నారు.
రేపటి నుంచి ఏప్రిల్ 30 వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు.
హైదరాబాద్లోని కోఠి, సికింద్రాబాద్ ఎస్బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఓపీ మిశ్రా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి