సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నిలకడగా ఆడుతోంది. టీమ్ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడుతున్నారు. కివీస్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. సౌథీ వేసిన ఏడో ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు బాది 10 రన్స్ రాబట్టాడు.
రోహిత్(21), గిల్(15) ఓపెనింగ్ జోడీ ఇన్నింగ్స్ శుభారంభం అందించాలనుకుంటోంది. భారీ షాట్లు ఆడకుండా, వికెట్ కాపాడుకుంటూ నిదానంగా క్రీజులో కుదురుకుంటున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.