న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం, శంఖుస్థాపనలు చేస్తారు. ఇందులో రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు, రూ.839 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇందులో బెనారస్ వర్సిటీలోని ఎంసీహెచ్లో 100 పడకల దవాఖానను ప్రారంభిస్తారు. అదేవిధంగా గంగా నదిలో పర్యాటక రోరో బోట్లను, వారణాసి-ఘాజీపూర్ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిని, జపాన్ సహకారంతో నిర్మించిన ‘రుద్రాక్ష్’ను ప్రధాని ప్రారంభిస్తారు.