న్యూఢిల్లీ: కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దేశానికి చెందిన ప్రఖ్యాత డాక్టర్లతో పాటు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 4.30 నిమిషాలకు ప్రముఖ డాక్టర్లతో ఆయన మాట్లాడనున్నారు. ఆ తర్వాత మళ్లీ సాయంత్రం 6 గంటలకు దిగ్గజ ఫార్మా కంపెనీలతో చర్చించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయన సమీక్షించనున్నారు.