రేపు వియత్నాం ప్రధానితో మోదీ సమావేశం

న్యూడిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వియత్నాం ప్రధాని న్గుయెన్ జువాక్ ఫుక్తో వర్చువల్ విధానంతో సమావేశం కానున్నారు. సమగ్ర సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, భవిష్యత్ అభివృద్ధిపై ఇద్దరు ప్రధానులు సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో వియత్నాం వైస్ ప్రెసిడెంట్ భారతదేశ సందర్శనపై చర్చించేందుకు ఏప్రిల్లో ఇద్దరు ప్రధానులు టెలీఫోన్ ద్వారా సంభాషించారు. గత నెలలోనూ 17వ ఏషియన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలోనూ న్గుయెన్ జువాక్ ఫుక్, మోదీ ఆన్లైన్లో సమావేశమయ్యారు. సోమవారం జరిగే సమావేశంలో ఇరువురు నాయకులు విస్తృత ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోనున్నారు. భారతదేశం-వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, భవిష్యత్తు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని, అవసరమైతే జాయింట్ విజన్ను ప్రకటించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
- మహేష్ ఫిట్నెస్ గోల్స్.. వీడియో వైరల్
- ‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
- శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత
- ఈ రాశులవారికి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం