అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,040 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. 1,00,103 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్త కేసులు నమోదయ్యాయని, వైరస్ ప్రభావంతో 14 మంది మృతి చెందారని పేర్కొంది. తాజాగా 4,576 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 19,17,253కు చేరాయని, ఇందులో 18,73,993 మంది కోలుకున్నారని చెప్పింది. వైరస్తో మొత్తం 12,960 మంది మృత్యువాతపడ్డారని, ప్రస్తుతం రాష్ట్రంలో 30,300 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,27,99,245 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.