ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ప్రధాని మోదీ ఆఫీస్

వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ప్రధాని మోదీ ఆఫీస్ అమ్మకానికి పెట్టారు. అవును ఆఫీస్కు సంబంధించిన వివరాలు, ఫొటోలతో ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో కొందరు వ్యక్తులు ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. ఆఫీస్ను రూ.7.5 కోట్లకు అమ్ముతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రకటనను గుర్తించిన పోలీసులు ఆ పోస్టును వెబ్సైట్ నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
ప్రధాని మోదీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రధానికి పార్లమెంటరీ కార్యాలయం ఉన్నది. దీనిని విల్లాగా పేర్కొన్న ప్రకటనకర్తలు, 6500 చదరపు గజాలున్న ఆ బిల్డింగ్లో నాలుగు గదులతోపాటు, నాలుగు బాత్రూమ్లు ఉన్నాయని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను లక్ష్మీకాంత్ ఓఝా పేరుతో ఓఎల్ఎక్స్లో ప్రకటనను పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- టిక్టాక్పై శాశ్వత నిషేధం: కేంద్రం సంకేతాలు
- ‘తాండవ్’లో వారి నాలుక కత్తిరిస్తే రూ.కోటి నజరానా:కర్ణిసేన
- వైట్హౌస్ ముందు బైడెన్కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్కు ఎఫ్టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్