హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఈఎస్ఐ దవాఖానలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులను తక్షణం విడుదలచేయాలని కేంద్ర కార్మిక ఉపాధిశాఖ సహాయ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ను రాజ్యసభసభ్యుడు బండా ప్రకాశ్ కోరా రు. బుధవారం ఢిల్లీలో మంత్రిని కలిసిన ఎంపీ.. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలే కాకుండా కొత్తగా ప్రతిపాదించిన ఈఎస్ఐ దవాఖానలు, డిస్పెన్సరీలపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రాసిన లేఖను జతచేస్తూ మరో లేఖ అందజేశారు. ప్రస్తుతం నాచారం ఈఎస్ఐ దవాఖానలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 18 లక్షల మంది కార్మికులకు బీమా చేశారని, వారి కుటుంబాల సంఖ్య దాదాపు 70- 80 లక్షల మంది ఉన్న నేపథ్యంలో వారికి వైద్యసేవలు అందించేందుకు సరిపడా ఈఎస్ఐ, డిస్పెన్సరీలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలోని 62 డిస్పెన్సరీల నవీకరణ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 2019-20 పెండింగ్లో ఉన్న రూ.104 కోట్ల నిధులను వెంటనే విడుదలచేయాలని కోరారు.