Modi US Tour | ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెలాఖరులో అమెరికాలో పర్యటించనున్నారు. క్వాడ్ సభ్య దేశాల సదస్సు నిర్వహణ తేదీలను బట్టి ఆయన పర్యటన ఖరారు కానున్నది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22-27 తేదీల మధ్య అమెరికాలో మోదీ పర్యటించవచ్చునని తెలుస్తున్నది.
న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. ఐరాస సర్వసభ్య సమావేశంతోపాటు క్వాడ్ దేశాల సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. అలాగే అమెరికా-భారత్ ద్వైపాక్షిక అంశాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చిస్తారు.
క్వాడ్ కూటమి చైర్మన్గా ఈ నెలాఖరులో వైదొలగాలని జపాన్ ప్రధాని యోషిహిడే సుగ అకస్మాత్గా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో క్వాడ్ భేటీ జరుగనున్నది. క్వాడ్ కూటమిలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి.