పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కేంద్రంలో, బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కులాల ఆధారంగా జనాభా గణనపై ప్రధాని మోదీతో చర్చించాలని సీఎం నితీశ్ను కలిసి తాము కోరినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న సీఎం నితీశ్ కుమార్, ప్రధాని మోదీకి లేఖ రాశారని, అయితే పీఎంవో కార్యాలయం నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇది సీఎం నితీశ్ను మోదీ అవమానించడమేనని ఆరోపించారు. ఇంత ముఖ్యమైన అంశాన్ని ఆయన విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ నేతలు ఈ అంశంపై కలిసి చర్చించేందుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరుతూ తేజశ్వి యాదవ్ శుక్రవారం లేఖ రాశారు. తన లేఖపై మోదీ స్పందించకపోతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాము ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.