న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం కావడంతో ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ఏడు వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశం అయ్యారు. వ్యాక్సినేషన్లో దేశం 100 కోట్ల మైలు రాయిని చేరుకోవడంతో టీకా ఉత్పత్తిదారుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ సమావేశంలో సీరం, భారత్ బయోటెక్, జైడస్, బయాలాజికల్ ఈ, జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్, రెడ్డీస్ ల్యాబ్, పానాసియా బయోటెక్ ప్రతినిధులు పాల్గొన్నారు.