2020-21లో 66 శాతం పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ, మార్చి 29: కరోనాలోనూ దేశీయ ఈక్విటీ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి. ఈ మహమ్మారి ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు క్రమంగా కోలుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 66 శాతం వృద్ధిని కనబరిచింది.
కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ సూచీలు నిలదొక్కుకోవడం విశేషం. ఈ వైరస్ కారణంగా భారత్తోపాటు ఇతర దేశాల సూచీలు తీవ్ర ఆటుపోటులకు గురయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు రోజుల ట్రేడింగ్ మాత్రమే మిగిలివున్నది.
l 2020-21లో బీఎస్ఈ సెన్సెక్స్ 19,5 40.01 పాయింట్లు లేదా 66.30 శాతం లాభపడింది.
l గతేడాది మార్చిలో సెన్సెక్స్ 8,828.80 పాయింట్లు లేదా 23 శాతం పడిపోయింది.
l నిరుడు ఏప్రిల్ 3న 27,500.59 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది.
l ఈ ఏడాది ఫిబ్రవరి 16న రికార్డు స్థాయి 52,516.76 పాయింట్లను చేరింది.
l సార్వత్రిక బడ్జెట్లో సంస్కరణలు ప్రకటించడం, పలు సంస్థలను ప్రైవేట్పరం చేయబోతున్నట్లు చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చింది.
l కరోనా వైరస్ సెకండ్ వేవ్తో ప్రస్తుతం మదుపరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మోటార్ ఫీల్డ్కు జంట సవాళ్లు: కండక్టర్ల కొరత+చిప్ల ధరలు పైపైకి..!!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!