న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: కొంత మంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తప్పుబట్టారని ప్రధాని మోదీ చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రక్షణ శాఖకు చెందిన రెండు కార్యాలయాల కాంప్లెక్స్లను గురువారం ఆయన ప్రారంభించారు. ‘కొన్ని దశాబ్దాల కిందట కట్టిన కార్యాలయాల్లో మన సిబ్బంది ఎలా పనిచేస్తున్నారని వాళ్లు ఒక్కసారైనా ఆలోచించారా? కనీసం మాట్లాడారా?’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు.