అంబర్పేట, జూన్ 27 : బాగ్అంబర్పేట డివిజన్ నం దనవనం కాలనీని అందంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం ఆయన నందనవనం కాలనీలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు స్థానిక సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాస్, లక్ష్మీపతి, సందీప్, మహేశ్, రజినీకాంత్, సంజీవ్, రమేశ్, శేఖర్, కిరణ్కుమార్, హేమంత్, రామ్మోహన్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక, జూన్ 27 : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. గో ల్నాక తులసీరాంనగర్కు చెందిన పి.లక్ష్మికి రూ.24 వేలు, గోవింద్నగర్కు చెందిన మమతకు రూ. 32 వేలు, వెంకటేశ్వరనగర్కు చెందిన అంజయ్యకు రూ. 34 వేలు, వీరన్నగుట్టకు చెందిన మశ్ఛేందర్కు రూ. 13వేలు, అశోక్నగర్కు చెందిన షేక్ యూనస్కు రూ.26 వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంబర్పేట డివిజన్ పటేల్నగర్కు చెందిన ప్రకాశ్గౌడ్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.22వేల చెక్కును ఆదివారం లబ్ధిదారుడికి స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్ అందజేశారు.