న్యూఢిల్లీ: రష్యా విదేశాంగశాఖ మంత్రి సర్గే లవ్రోవ్ భారత్కు చేరుకున్నారు. రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం ఆయన ఈ ఉదయం ఢిల్లీకి విచ్చేశారు. పర్యటనలో భాగంగా లవ్రోవ్ భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించనున్నారు. అదేవిధంగా ఇప్పటికే పెండింగ్ పడి ఈ ఏడాది చివరిలో జరుగాల్సిన భారత్-రష్యా వార్షిక సదస్సు ఏర్పాట్ల గురించి కూడా వారు సమీక్ష చేయనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.