బీజింగ్/న్యూఢిల్లీ, మార్చి 16: ‘మా దేశానికి రావాలనుకుంటే మేం తయారుచేసిన కరోనా వ్యాక్సినే వేయించుకోవాల’ని చైనా మెలిక పెట్టింది. భారత్తో పాటు 19 దేశాలకు చెందినవాళ్లు తమ దేశానికి రావడానికి అనుమతి ఇస్తున్నట్టు చైనా మంగళవారం ప్రకటించింది. రావడానికి ముందు వారు తప్పనిసరిగా తమ దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని షరతు విధించింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం తన వెబ్సైట్లో తెలిపింది. చైనాలో తయారైన కరోనా వ్యాక్సిన్ భారతీయులకు ఎలా లభిస్తుందో మాత్రం వెల్లడించలేదు.