న్యూఢిల్లి: రైతు బంధు తరహాలో కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులకు కిసాన్ సమ్మన్ నిధి ( PM Kisan Samman Nidhi ) కింద రెండు వేల ఇస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ 9వ ఇన్స్టాల్మెంట్ను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.19,500 కోట్ల మొత్తాన్ని రైతుల అకౌంట్లోకి క్రెడిట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ అమౌంట్ను రిలీజ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 తర్వాత అమౌంట్ క్రెడిట్ అవుతోంది. సుమారు 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిధి వెళ్తుంది. ఆగస్టు-నవంబర్ పీరియడ్కు సంబంధించిన అమౌంట్ను రిలీజ్ చేశారు. పీఎం కిసాన్ వెబ్సైట్లో రైతులు తమ వివరాలను తెలుసుకోవచ్చు. కింద ఉన్న ఈ లింక్ను ఓపెన్ చేసి చూసినా.. మీ అకౌంట్లో పడ్డ అమౌంట్ తెలుస్తుంది.
https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx