కొండ పోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాల మళ్లింపుతో హల్దీ వాగు, మంజీరా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీవాగు ప్రాజెక్టు గోదావరి జలాలతో నిండి అలుగు పారుతోంది. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు.. గంగమ్మకు పూజలు చేసి చీర, సారెలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్, మెదక్ ఎమ్మెల్సీలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి