రాయ్పూర్ : (Pledge fulfilled) కోరికలు తీరేందుకు దేవుళ్లకు మొక్కులు కట్టడం మన వాళ్లకు అలవాటు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పలువురు చెప్పులు ధరించనని మొక్కులు పెట్టుకుంటే.. మరికొందరేమో గడ్డం, మీసాలు, తల వెంట్రుకలు తీయమంటూ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కూడా పలువురు దేవుళ్లకు మొక్కులు కట్టి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగానే చెల్లించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇదే కోవలో ఛత్తీస్గఢ్లో ప్రత్యేక జిల్లా కోసం గడ్డం పెంచిన ఓ ఉద్యమకారుడు.. ఆదివారం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన చేయగానే సంతోషంతో 20 ఏండ్ల పాటు పెంచిన గడ్డాన్ని తీసేశాడు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మహేంద్రగఢ్ ప్రాంతానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు రామ్శంకర్ గుప్తా. ఇతడు గతంలో ప్రత్యేక ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోసం ఉద్యమించాడు. తమకు రాష్ట్రం ఇచ్చేంతవరక గడ్డం, మీసాలు తీయనని ప్రతినబూనాడు. 2000 నవంబర్ 1 న ఛత్తీసగఢ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ప్రకటన చేయడంతో సంతోషంలో చాలా రోజులపాటు పెంచిన గడ్డం, మీసాలు తీసేశాడు. అనంతరం తమకు ప్రత్యేక జిల్లా కావాలంటూ ఉద్యమం లేపాడు. ఇందుకు అప్పటిమాదిరిగానే గడ్డం తీయనని శపథం చేశాడు.
అయితే, స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ చేసిన ప్రత్యేక జిల్లాల ఏర్పాటు ప్రకటనలో మహేంద్రగఢ్ జిల్లా కూడా ఉండటంతో రామ్శంకర్ గుప్తా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తన 20 ఏండ్ల ప్రతిజ్ఞ నెరవేరడంతో వెంటనే గడ్డం కత్తిరించుకున్నాడు. మహేంద్రగఢ్ ప్రజల డిమాండ్ను ప్రభుత్వం గుర్తించి కొత్త జిల్లా ఏర్పాటుచేయడం పట్ల రామ్శంకర్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. నా కోరిక నెరవేరినందున 20 ఏండ్ల పాటు తీయకుండా ఉంచిన గడ్డాన్ని ఇప్పుడు తీశానని ఆయన చెప్పారు.
మేఘాలయలో హింస : హోం మంత్రి రాజీనామా
దేశం విడిచి ఎందుకు వెళ్లిపోయానంటే..? : అష్రఫ్ ఘనీ
ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
సోషల్ మీడియాలో జాతీయ గీతం కొత్త రికార్డు.. అదేంటంటే..?
ముంబై ఇండియన్స్కు వెరైటీగా అనౌన్స్మెంట్
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..