నిజామాబాద్ రూరల్, మార్చి 28 : నిజామాబాద్ రూరల్ మండలంలో పన్ను వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యు లు, సిబ్బంది పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, డీఎల్పీవో నాగరాజు మండలంలోని 19 గ్రామపంచాయతీల కార్యదర్శులు, కారోబార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పన్నుల వసూళ్లపై దిశానిర్దేశం చేశారు. ఎంపీడీవో మల్లేశ్, ఎంపీవో మధురిమ సమన్వయంతో పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ముందుకు సాగుతున్నారు.
సర్పంచులు, వార్డు మెంబర్లు సైతం పన్ను వసూళ్లపై దృష్టి సారించి కార్యదర్శుల బృందాలకు సంపూర్ణ సహకారమందిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే 10 గ్రామపంచాయతీల్లో వందశాతం, రెండు గ్రామాల్లో 96శాతం, ఒక గ్రామంలో 81 శాతం పన్ను వసూలు పూర్తయ్యింది. కొత్తగా ఏర్పడిన శ్రీనగర్, ధర్మారం తండా, గాంధీనగర్తండా, చక్రధర్నగర్ తండా, శాస్త్రీనగర్ గ్రామపంచాయతీల్లో ప్రజలు 100 శాతం పన్ను చెల్లించారు. ఆకుల కొండూర్ సర్పంచ్గా రెండో పర్యాయం కొనసాగుతున్న అశోక్ నేతృత్వంలో ఏడేండ్లుగా వందశాతం పన్ను వసూలవుతున్నది. పాల్ద, జలాల్పూర్, ముత్తకుంట, లింగితండా గ్రామాల్లో పన్ను వసూళ్ల ప్రక్రియ పూర్తయ్యింది. మండలవ్యాప్తంగా ఇంటి పన్నుతోపాటు నాన్ ట్యాక్స్ మొత్తం కలిపి రూ.కోటీ 3 లక్షల 88 వేలు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.87,57,000 వసూలయ్యాయి. వందశాతం పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో కార్యదర్శుల బృందాలు ముందుకు సాగుతున్నాయి.
ప్రజలు సహకరిస్తున్నారు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. ఎల్ఈడీ బల్బులు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అభివృ ద్ధి కళ్లెదుటే కనిపిస్తుండడంతో ప్రజలు పన్ను చెల్లించి సహకరిస్తున్నారు. వంద శాతం పన్ను వసూలు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
వందశాతం వసూలు లక్ష్యం
ప్రతి పంచాయతీలో 100 శాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాం. కార్యదర్శులు, కారోబార్ల కృషి ఫలితంగా 10 గ్రామపంచాయతీల్లో 100 శాతం పన్ను వసూలైంది. మిగతా గ్రామాల్లో ఈ నెలాఖరు వరకు వందశాతం పన్ను వసూలు చేస్తాం. సమష్టికృషితో, పక్కాప్రణాళికతో పన్ను వసూలు చేస్తున్నాం.
ఇవీ కూడా చదవండి..
పెట్రోల్పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
రూ.44వేల దిగువకు బంగారం ధర.. ఒక్కరోజులో రూ.1,822 తగ్గిన వెండి