ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ( flipkart ) భారత వినియోగదారుల కోసం ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వేరబుల్స్, స్మార్ట్టీవీలు, టాబ్లెట్లు, ఆడియో డివైజ్లు, హెడ్ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో నిర్వహిస్తోన్న ఈ సేల్ మే 2 నుంచి మే 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్ మే 1, శనివారం అర్ధరాత్రి నుంచి ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు అందుబాటులోకి రానుంది.
ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. పలు ఉత్పత్తులపై తగ్గింపు,
ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లు, ఇతర ఉపకరణాలపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని
వినియోగదారులకు అందించనుంది. రాబోయే సేల్లో యాపిల్, వివో, ఆసుస్, షియోమీ తదితర కంపెనీలకు చెందిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉంచనుంది. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలపై 80శాతం వరకు తగ్గింపుతో పాటు, టెలివిజన్ సెట్లు, అప్లయెన్సెస్పై 75శాతం వరకు తగ్గింపును ఇవ్వనుంది.
ఈ సేల్లోభాగంగా స్మార్ట్వాచ్లు,హెడ్ఫోన్లపై 70శాతం వరకు, బ్లూటూత్ స్పీకర్లపై 70శాతం వరకు, ల్యాప్టాప్లపై 40శాతం, పవర్బ్యాంక్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. వన్ప్లస్ 32 అంగుళాల స్మార్ట్టీవీని రూ.14,999కే వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లు ఈ సేల్లో అందించనున్నారు.