మార్చిలోనే 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్
ఈ యేడాది ఇప్పటివరకు 43 డిగ్రీలు అత్యధికం
నిర్మల్ అర్బన్, మార్చి 29 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మే నెలలో నమోదు కావాల్సిన టెంపరేచర్స్ మార్చిలోనే నమోదవుతున్నది. రాత్రి చలి ఉన్నా.. పగలు మాత్రం రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతున్నది. రెండు రోజులుగా 40గా నమోదవుతున్నాయి. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 40 డిగ్రీలకుపైగా నమోదుకాగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం అత్యధికంగా 43 డిగ్రీలుగా ఉంది. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారగా.. ప్రజలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు.
ఇవి కూడా చదవండి
శరీరానికి సరిపడా సీ విటమిన్ కావాలంటే.. వీటిని తినండి
నాగార్జున సాగర్ ఎర్త్డ్యామ్పై అగ్నిప్రమాదం