శైలజకూ దక్కని చోటు
తిరువనంతపురం, మే 18: చరిత్రను తిరగరాస్తూ కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. మునుపటి క్యాబినెట్లోని మంత్రులందరినీ తొలగించి ఈసారి కొత్తవారికి చోటు కల్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా కరోనా నియంత్రణలో సమర్థంగా వ్యవహరించిన వైద్యశాఖ మంత్రి కేకే శైలజను కూడా తొలగించడం రాజకీయ పండితులను సైతం విస్మయపరిచింది. ఇది పార్టీ సమిష్టి నిర్ణయమని కొత్తగా క్యాబినెట్లో చోటు దక్కించుకున్న మంత్రి ఎంవీ గోవిందన్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ శైలజను తొలగించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయన్ అల్లుడు మహమ్మద్ రియాస్కు మంత్రివర్గంలో చోటుదక్కింది.