ఆగస్టులో విచారించనున్న ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, జూలై 16: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల వాడకాన్ని నిషేధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు వచ్చే నెలలో విచారణ చేపట్టనున్నది. దేశంలో రాబోయే ఎన్నికలలో బ్యాలెట్ పత్రాల ద్వారానే ఓటింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది సీఆర్ జయసుకిన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. సాంకేతిక కారణాల రీత్యా విచార ణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. అభి వృద్ధి చెందిన దేశా లైన ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికాలో కూడా ఈవీ ఎంలను బ్యాన్ చేసి సాంప్రదాయ బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ నిర్వహిస్తున్నారని పిటిషన్దారు తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.