న్యూఢిల్లీ, మే 4: పద్దెనిమిది రోజుల విరామం అనంతరం, ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంగళవారం పెట్రోల్ ధర లీటర్కు 15 పైసలు, డీజిల్ రేటు లీటర్కు 18 పైసల చొప్పున పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.55కు పెరిగింది. డీజిల్ ధర రూ.80.91కు పెరిగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ధరలను పెంచినట్టు చమురు కంపెనీలు తెలిపాయి.