న్యూఢిల్లీ : ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా లీటరు పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 27 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఇప్పటి వరకు బెంగళూరు, ముంబై, హైదరాబాద్లలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటగా.. తాజాగా చెన్నైలో రూ.100కు అడుగు దూరంలో ఉంది.ప్రస్తుతం చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.98.88 పలుకుతున్నది. మొత్తానికి 9 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ రూ.100 దాటిపోయింది. మే 4 నుంచి ఇప్పటివరకు లీటరు పెట్రోల్పై రూ.7.36, డీజిల్పై రూ.7.77 పెరిగింది.