హైదరాబాద్ : నగరంలో హనుమాన్ శోభాయాత్ర రద్దు అయింది. అయితే ఈ యాత్రను కేవలం 21 మందితో మాత్రమే నిర్వహించాలని, షరతులతో కూడిన అనుమతిని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. కానీ కోర్టు ఆదేశించిన 21 మంది కంటే ఎక్కువగా హనుమాన్ శోభాయాత్రకు భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో శోభాయాత్రను భజరంగ్దళ్ వీహెచ్పీ ప్రతినిధులు రద్దు చేసుకున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది పాతబస్తీలోని గౌలిగూడ నుంచి సికింద్రాబాద్లోని తాడ్బండ్ వరకు హనుమాన్ శోభాయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతి దృష్ట్యా ఈ ఏడాది శోభాయాత్ర విషయంలో కోర్టు కఠిన షరతులు విధించింది.
ఇవికూడా చదవండి..