న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 30 పైసలు వడ్డించాయి. దీతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు ప్రెటోల్ ధర రూ.101.84కి చేరింది. అయితే డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉన్నది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.45, కోల్కతాలో పెట్రోల్ రూ.102.08, డీజిల్ రూ.93.02, చెన్నైలో పెట్రోల్ రూ.102.49, డీజిల్ రూ.94.39, జైపూర్లో పెట్రోల్ రూ.108.71, డీజిల్ రూ.99.02, హైదరాబాద్లో పెట్రోల్ రూ.105.83, డీజిల్ రూ.97.96గా ఉన్నది.