న్యూఢిల్లీ, జూన్ 1: అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ కన్నా భారత ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర ఎక్కువ. న్యూయార్క్లో లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 57 (0.79 డాలర్లు) ఉంటే.. ముంబైలో రూ.100.72 పలుకుతున్నది. అంటే దాదాపు రెట్టింపు. కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన ఇంధన ధరలు ఇటీవల వరుసగా పెరుగుతున్నాయి. ఇటీవల నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వరుసగా 17 సార్లు ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. మంగళవారం లీటరు పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 23 పైసలను పెంచడంతో ధరలు రికార్డుస్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.94.49కి చేరగా, డీజిల్ ధర రూ.85.38కి పెరిగింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే.