హైదరాబాద్/నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 27: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక గులాబీ జెండా అని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో మంగళవారం కేకే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ స్థాప న తెలంగాణ ప్రజలకు మరవలేని సుదినమని చెప్పారు. రాష్ట్రం కోసం ఎంతోమంది దశాబ్దాలపాటు కలలుకన్నా వాటిని సాకారం చేసిన గొప్పనేత కేసీఆర్ అని.. ఆయన చరిత్రలో నిలిచిపోతారని కొనియారు. అనంతరం తెలంగాణతల్లి విగ్రహానికి కేకే పూలమాల వేశారు. ఆచార్య జయశంకర్ విగ్రహానికి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లు శేరి సుభాష్రెడ్డి, ఎం శ్రీనివాస్రెడ్డి, మ హేందర్రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ కార్యాలయ ఇంచార్జి నాయినేని రాజేశ్వర్రావు, జనరల్ సెక్రటరీ భరత్కుమార్రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లాల్లో ఘనంగా పార్టీ ఆవిర్భావోత్సవం..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. సూర్యాపేటలోని తన నివాసంపై విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. నల్లగొండలో జడ్పీచైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, తుంగతుర్తిలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ మం దుల సామేలు టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. హైదరాబాద్ నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ అంటే వ్యక్తి కాదని కేసీఆర్ తెలంగాణ సమాజ చైతన్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ప్రణాళికాసం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమా ర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడే టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
సీఎం కేసీఆర్బాటలో సైనికుడిగా: మంత్రి హరీశ్రావు
‘ఉద్యమం నిప్పు రవ్వగా మొదలైన రోజులను తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినపుడు జన్మధన్యమైన సంతృప్తి. ఏండ్లుగా కేసీఆర్ బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవితకాల సాఫల్యం’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
కేసీఆర్కు సెల్యూట్: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం జీవితాన్ని త్యాగంచేసే స్థాయికి వెళ్లిన నిజమైన నాయకుడు సీఎం కేసీఆర్కు సెల్యూట్ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా గాంధీ నెల్సన్ మండేలా చెప్పిన ఉదాత్తమైన మాటలను ఆమె గుర్తుచేశారు. ‘అవరోధాలు కొందరికి అడ్డంకిగా మారితే, మరికొందరిని గొప్ప వ్యక్తులుగా తయారుచేస్తాయి’ అనే వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ విషయంలో అక్షరసత్యాలని పేర్కొన్నారు. ప్రజల శేయ స్సు కోసం 20 ఏండ్లుగా అనేక త్యాగాలు చేసిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ఆమె ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ గాంధీ కేసీఆర్
జనగామ జిల్లా పెంబర్తి ఉప సర్పంచ్ రేఖ మంగళవారం పిల్లలకు కేసీఆర్ చిత్రపటాన్ని చూపిస్తూ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాట పటిమ గురించి తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించిన ధీరుడు కేసీఆర్ అని, సీఎంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. తెలంగాణ గాంధీ తాత కేసీఆర్ అని చెప్తున్న సమయంలో పిల్లలు కనురెప్ప వాల్చకుండా కేసీఆర్ చిత్రపటాన్ని చూస్తూ విన్నారు.