జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని ఘన్పూర్ మండల కేంద్రంలో రైతువేదిక, పంచాయతీ కార్యాలయాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతు వేదిక, పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కోసం మీ అందరికి తోడుగా ఉంటానని మంత్రి తెలిపారు.
పల్లె ప్రగతితో గ్రామాలు మెరిసిపోతున్నాయన్నారు. గతంలో ఏ పార్టీ చేయని విధంగా సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక