న్యూఢిల్లీ: దేశంలో చమురు మంట కొనసాగుతున్నది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా రెండో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశ రాజధానిలో చమురు ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54కు పెరగగా, డీజిల్ ధర రూ.95.27కు చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.112.44, డీజిల్ రూ.103.26, చెన్నైలో పెట్రోల్ రూ.103.61, డీజిల్ రూ.99.59కి, కోల్కతాలో పెట్రోల్ రూ.107.12, డీజిల్ రూ.98.38కి చేరాయి.
ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై 36 పైసలు పెరగడంతో రూ.110.82కు, డీజిల్పై 38 పైసలు అధికమవడంతో రూ.103.94కు చేరాయి.