కరోనా వైరస్ ప్రకంపనలు పుట్టిస్తుంది. గత ఏడాది ఎందరో ప్రముఖులను కాటేసిన కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లోను భయపెట్టిస్తుంది. అయితే గత ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టించగా, మళ్లీ కరోనా ఎఫెక్ట్ వారి ఫ్యామిలీపై పడింది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్(78) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోండి అని ఆయన కోరారు.
విజయేంద్ర ప్రసాద్కు కరోనా అని తేలడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం క్వారంటైన్లోకి వెళ్లింది. దీంతో ఈ చిత్ర షూటింగ్ మరికొంత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఈ చిత్ర టీం సభ్యులు అలియా భట్, అజయ్ దేవగణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక గత ఏడాది రాజమౌళితో పాటు ఆయన భర్య రమా రాజమౌళి, ఎంఎం కీరవాణితో పాటు కొందరు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అక్టోబర్ 13న థియేటర్స్లో విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, ఇది కాస్త కష్టమనే అనిపిస్తుంది.